బాలసదన్‌కు బాలిక అప్పగింత

3 Oct, 2016 00:22 IST|Sakshi
బాలసదన్‌కు బాలిక అప్పగింత

యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తప్పిపోయిన ఓ బాలికను బాలసదన్‌కు అప్పగించారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఓ బాలిక ఏడ్చుతూ తిరువీధుల వెంట తిరుగుతుంది. స్థానికులు, వ్యాపారస్తులు యాదగిరిగుట్ట ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆ బాలికను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు, ఊరు పేర్లను వెల్లడించడం లేదని ఎస్‌ఐ తెలిపారు. దీంతో భువనగిరి బాలసదన్‌కు సమాచారం అక్కడి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు