లైంగికదాడి కేసులో యువకుని అరెస్ట్

9 Aug, 2016 20:05 IST|Sakshi
 ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని సైదాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కాట్న సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం సుబ్రహ్మణ్యనగర్ కాలనీకి చెందిన మహేష్ డిగ్రి చదువుతున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే బాలిక పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తే ఆ యువకుడు లేదు పొమ్మన్నాడు. పెద్దలు చెప్పిన వినకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 6న సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
 
>
మరిన్ని వార్తలు