విద్యుదాఘాతంతో యువకుడి మృతి

18 Sep, 2017 22:16 IST|Sakshi

లేపాక్షి: గొంగటిపల్లి గ్రామానికి చెందిన రవి (30) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలోని సంప్‌కు కొళాయి నుంచి నీరు రాకపోవడంతో మరమ్మతు నిమిత్తం రవిని పిలిచాడు. సంప్‌ దగ్గర మోటారు రిపేరీ చేస్తున్న సమయంలో విద్యుత్‌షాక్‌కు గురైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుబ్బరామనాయక్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు