శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లు వెండి రథంపై కొలువుదీరి ఆలయప్రాంగణంలో ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సహస్రదీపాలంకరణ మంటపానికి చేర్చారు. అక్కడ విశేషపూజల అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య స్వామిఅమ్మవార్లకు సహస్రదీపార్చన నిర్వహించారు. అనంతరం వెండిరథంపై ఆవహింపజేసి ఉత్సవమూర్తులను ఆలయప్రదక్షిణ చేయించి గర్భాలయ దక్షిణ ద్వారం వద్దకు చేర్చారు. భక్తులు అశేషంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు.