ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

28 Apr, 2016 11:57 IST|Sakshi
ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మున్సిపల్ డీఈ వంగపండు వెంకట సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేశారు. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేసి... సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1.10 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే పలు కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కృష్ణాజిల్లా గుడివాడలోని మరో ప్రదేశాలలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం.




 

మరిన్ని వార్తలు