సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

19 Jul, 2017 18:20 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రం పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో ప్రతి డాక్యుమెంట్ పైనా 0.5 శాతం కమిషన్ వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. కేవలం ఒక్కరోజులోనే 15 డాక్యుమెంట్లకు గాను కమీషన్ రూపంలో రూ.50వేలు వసూలు చేసినట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై డీజీకి నివేదిక సమర్పించి విచారణ చేపడతామని ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలా బాను వెల్లడించారు.

మరిన్ని వార్తలు