ఉయ్యాలవాడ : మండలంలోని మాయలూరు గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతిచెందింది. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన విజయ్కుమార్, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు. ఉదయం విజయ్కుమార్ తల్లి ఇంటి బయట వంట చేస్తుండగా చిన్న కుమార్తె వైష్ణవి ఆడుకుంటూ అక్కడికి వెళ్లింది. ఈపాపను ఆమె గమనించలేదు. అప్పుడే వంట గదికి ఇరువైపులా అమర్చుకున్న నాపరాతి బండల్లో ఒక బండ విరిగి చిన్నారి మీద పడింది. తలకు తీవ్ర రక్తగాయమైన ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.