నూతన సిలబస్‌ను అనుసరించి బోధించాలి

21 Aug, 2016 23:59 IST|Sakshi
కేయూ క్యాంపస్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులో సీబీసీఎస్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినందున బాటనీ లెక్చరర్లు తమ పాఠ్యాంశా ల్లో నూతన సిలబస్‌ను అనుసరించి విద్యార్థులకు బోధనలు అందించాలని కేయూ బాటనీ విభాగం అధిప తి డాక్టర్‌ వి.కృష్ణారెyì్డ  కోరారు. క్యాం పస్‌లోని బాటనీ విభాగంలో ఆది వారం డిగ్రీలోని సీబీసీఎస్‌ సిలబస్‌ పై బాటనీ లెక్చరర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులకు మెరుగైన బోధనలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సదస్సులో కేయూ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ప్రమీలాదేవి, బీఓఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎరాగన్, డాక్టర్‌ సురేఖ, వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఆశీర్వాదం పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు