రాయదుర్గం : నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం చెర్లేపల్లిలో ఈ నెల 19వ తేదీన జరిగిన హత్యకేసులో అదే గ్రామానికి చెందిన కుపేంద్రరెడ్డి అనే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చలపతిరావు వెల్లడించారు. చెర్లోపల్లికి చెందిన శంకర్రెడ్డి కుమారుడు బసవరాజుకు, అతడి అన్న కుమారుడు కుపేంద్రరెడ్డికి వ్యవసాయ పొలంలో నీటిపారుదల విషయంలో మనస్పర్థలున్నాయి.
నిందితుడు కుపేంద్రరెడ్డి ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని అన్న బసవరాజును చంపాలని నిర్ణయించుకున్నాడు. బసవ రాజు చెర్లోపల్లిలో మెకానిక్ షెడ్డు వద్ద ఉండగా, అటుగా వచ్చిన కుపేంద్రరెడ్డి అక్కడే ఉన్న రాడ్తో బసవరాజు తలపై బలంగా మోది పరారయ్యాడు. బసవరాజును వైద్యం కోసం బళ్లారికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతి చెందాడు. మతుడి తమ్ముడు హేమారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, చెర్లోపల్లి క్రాస్ వద్దనున్న కుపేంద్రరెడ్డిని గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట డీ.హీరేహాళ్ ఎస్ఐ బి.శేఖర్, సిబ్బంది ఉన్నారు.