నిందితుల అరెస్ట్‌

2 Sep, 2016 00:44 IST|Sakshi

ఓడీ చెరువు: వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఓడీ చెరువు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన  సద్దల నారాయణరెడ్డి భార్య ఐశ్వర్య గత నెల 12న ఆత్మహత్యకు పాల్పడింది. ఐశ్వర్య భర్త నారాయణరెడ్డి, అత్తమామలు సద్దల రంగారెడ్డి, సద్దల వెంకటలక్ష్మమ్మ, మరిది మదన్‌మోహన్‌రెడ్డి వేధింపులు తాళలేకే కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి  శివమ్మ ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు