దహెగాం : మండలంలోని కల్వాడ మర్రిపల్లి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు పీఎస్సై సుధాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... గుడుంబా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. కల్వాడ గ్రామానికి చెందిన బానోత్ తుకారాం, మర్రిపల్లి వాసి బదావత్ వినోద్లపై కేసు నమోదు చేశామని తెలిపారు. వీరి వద్ద 100 గుడుంబా ప్యాకెట్లు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని వివరించారు.