బీసీ సంఘాల సదస్సులో కలకలం!

9 Feb, 2016 14:22 IST|Sakshi

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన బీసీ సంఘాల సదస్సులో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. బీసీ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తుండగా ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ వొంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. ఇది గమనించిన పక్కనున్న వాళ్లు ఆ కార్యకర్తని అడ్డుకున్నారు.

బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆ కార్యకర్త యత్నాన్ని అడ్డుకుని అతడిని మందలించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల కోసం టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు