బాలకృష్ణ పుష్కర స్నానం

18 Aug, 2016 12:35 IST|Sakshi
బాలకృష్ణ పుష్కర స్నానం

మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా సోమశిల వద్ద పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా సోమశిల వద్ద బాలయ్య కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కృష్ణా పుష్కరాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు బాలకృష్ణ కుటుంబ సభ్యులు.... ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద  పుష్కర స్నానమాచరించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు