వరద బాధితులను ఆదుకోవాలి

26 Sep, 2016 00:34 IST|Sakshi
  • సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి
  • న్యూశాయంపేట : నగరంలో వరద ఉధృతి తగ్గినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారని వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. వేలాది గుడిసెలు వరదలో కొట్టుకుపోయి అనేకమంది పేదలు నిరాశ్రయులయ్యారన్నారు. పునరావాస కేంద్రాలను మరో వారం రోజుల పాటు కొనసాగించి భోజన వసతులు కల్పించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రతి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, రూ.పది వేలు ఆర్థికసాయం అందించాలని కోరారు. అలాగే అంటువ్యాధులు వ్యాపిం చకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.   
మరిన్ని వార్తలు