రైతులకు పగటి పూటే పూర్తి విద్యుత్: పోచారం

24 Mar, 2016 10:05 IST|Sakshi

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పగటి పూటే 9 గంటలు కరెంట్ ఇవ్వడంపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిజాంసాగర్కు నీరందిస్తామన్నారు. తెలంగాణలోని అన్ని నియోజక వర్గాలకు పశువైద్య సంచార వాహనం కెటాయిస్తామని పోచారం వెల్లడించారు.
 

>
మరిన్ని వార్తలు