సాగర్‌లో ఏఐఏడబ్ల్యూయూ నాయకులు

23 Sep, 2016 22:33 IST|Sakshi
సాగర్‌లో ఏఐఏడబ్ల్యూయూ నాయకులు
నాగార్జునసాగర్‌: అఖిల భారత వ్యవసాయకార్మిక సంఘం నాయకులు శుక్రవారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. రెండు రోజులుగా నల్లగొండలో జరిగిన జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరైన అనంతరం వారు సాగర్‌కు వచ్చారు. ప్రాజెక్టును సందర్శించిన అనంతరం లాంచీలో నాగార్జుకొండకు వెళ్లారు. అనంతరం ఎత్తిపోతల, బుద్దవనం ప్రాంతాలను సందర్శించారు. వీరికి స్థానిక జెన్‌కో అతిథిగృహంలో మెమొంటోలు అందజేశారు. వీరి వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రాంగారెడ్డి, నాగిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కేవీ. అయిలయ్య, గౌతంరెడ్డి, మునినాయక్‌లు ఉన్నారు.
 
 
మరిన్ని వార్తలు