ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

7 Nov, 2016 16:25 IST|Sakshi
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది.  విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయింది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విజయవాడ-న్యూఢిల్లీ ఎయిరిండియా విమానం  రెండుసార్లు సాంకేతిక సమస్యలకు గురికావడం ఆదివారం కలకలం రేపిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు