వీరన్నపేట : ఈ నెల 6న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు మహాస¿¶ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినరసింహయాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో జిల్లాల విభజన దృష్ట్యా జిల్లా కార్యవర్గాన్ని విస్తరణ, 2015–16 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరచిన యాదవ విద్యార్థుల సన్మాన కార్యక్రమం, నియోజకవర్గాల వారిగా యాదవ మహాసభ సదస్సుల ఏర్పాటు అంశాలపై చర్చించనున్నామని వెల్లడించారు. అంతేగాక జిల్లా గొర్రెల కాపరుల యూనియన్ కార్యకలాపాలు, ఎన్సీడీసీ రుణాలపై చర్చించడం, జిల్లాకు ఏ రుణాలు మంజూరయ్యాయనే అంశంపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు రాందాస్యాదవ్, చందుయాదవ్, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పాండుయాదవ్, ప్రాథమిక గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు సాయిలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.