కర్నూలు(హాస్పిటల్): యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా గౌరవ డాక్టరేట్ను ఉస్మానియా కళాశాల అధ్యాపకులు డాక్టర్ మన్సూర్ రహమాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కరస్పాండెంట్ అజ్రాజావేద్ మాట్లాడుతూ అర్థశాస్త్ర ఆచార్యులుగా 13 సంవత్సరాలుగా డాక్టర్ రహమాన్ అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యనిర్వాహక సభ్యులుగా కూడా సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిలార్ మహమ్మద్, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రంగారెడ్డి, నరేంద్రకుమార్, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.