ఖమ్మం వ్యవసాయం : ప్రస్తుత ఖరీఫ్లో సాగు చేసిన పత్తి పంట విక్రయానికి వచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శనివారం కొత్త పత్తి రావడం ఇదే ప్రథమం. తొలకరి ఆరంభంలో వేసిన పత్తి ప్రస్తుతం దిగుబడి వచ్చేలా ఉంది. శనివారం మార్కెట్కు 46 పత్తి బస్తాలు విక్రయానికి వచ్చినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాద్రావు తెలిపారు. కొత్త పత్తి క్వింటాల్ ధర రూ.4,850 పలికింది. చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన రైతు కావూరి రమేష్ 19 బస్తాలు విక్రయానికి తెచ్చాడు.