పొలంలో బంగారు నాణాల కుండ

8 Sep, 2015 17:26 IST|Sakshi
పొలంలో బంగారు నాణాల కుండ

బయ్యారం (ఖమ్మం) : ఓ రైతు పొలం దున్నుతుండగా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి బంగారు నాణాలు దొరికాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం సౌమ్యతండాలో మంగళవారం చోటుచేసుకుంది.

 

సౌమ్యతండాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో అరక దున్నుతుండగా 40 బంగారు నాణాలు ఉన్న కుండ దొరికింది. ఈ విషయం తెలుసుకున్న పొలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు