విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ

2 Apr, 2016 11:34 IST|Sakshi

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల వయో పరిమితి పెంపు, ఇసుక పాలసీ, కృష్ణా పుష్కరాలు, తాగునీటి సమస్య, ఇళ్ల ప్రారంభోత్సవాలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖ రాయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు