ఏపీ పాలిటెక్నిక్ ఫలితాలు విడుదల

6 May, 2016 12:19 IST|Sakshi
ఏపీ పాలిటెక్నిక్ ఫలితాలు విడుదల

విశాఖ : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ అకడమిక్ సెనెట్ హాల్లో  ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 82.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకట శేషసాయి 120 మార్కులుగానూ 120 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.ఇక  శ్రీకాకుళంకు చెందిన  శ్రీరాజ్ గుప్తా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట రోహిత్ 119 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. పాలిసెట్లో బాలికలు 87.5, బాలురు 82.2 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాలు...https://polycetap.nic.in,www.sakshieducation.com,ww.manabadi.com,ww.schools9.com, www.vidhyavision.com,www.bharathstudent.com,www.apschoolsinfo.com,www.prathibhaplus.com,www.indiaresults.com, www.exametc.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

మరిన్ని వార్తలు