అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు పెంపు

6 Feb, 2016 17:01 IST|Sakshi

హైదరాబాద్: అంగన్ వాడీ ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 7వేలు, మినీ అంగన్ వాడీ కార్యకర్తకు రూ. 4,500 పెంచగా,  అంగన్ వాడీ హెల్పర్లకు రూ. 4,500 ల చొప్పున జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంగన్ వాడీలకు పెంచిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు