అంగన్‌వాడీ సిబ్బంది తొలగింపు

11 Nov, 2016 23:06 IST|Sakshi
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఐసీడీఎస్‌లో ఒక అంగన్‌వాడీ కార్యకర్తతో పాటు ముగ్గురు హెల్పర్లను సర్వీసు నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ సి.హెచ్‌.విజయమోహన్‌ ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయం తీసుకుంది. పత్తికొండ ప్రాజెక్టు పరిధిలో వీరు పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా వీరు విధులకు దూరంగా అజ్ఞాతంలో ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ సమావేశం అయ్యింది. అజ్ఞాతంలో ఉన్న వీరిపై సమగ్రంగా విచారణ జరిపి సర్వీసు నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని కలెక్టర్‌ ప్రకటించారు. 
 
మరిన్ని వార్తలు