విజయవాడ: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇన్ఫో అధినేత అనిల్ ధీరూభాయ్ అంబానీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనిల్ మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. రాజధాని నిర్మాణం గురించి ఈ సందర్భంగా అనిల్కు ముఖ్యమంత్రి వివరించారు.
తొలుత ఆయన రాకను గోప్యంగా ఉంచిన ముఖ్యమంత్రి కార్యాలయం రాత్రికి వివరాలు వెల్లడించింది. ఈ సమావేశంలో అనిల్ అంబానీ చంద్రబాబుతో 4 జీ సేవలపై చర్చించినట్టు తెలిసింది.