రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌గా అంజలి

24 Sep, 2016 22:31 IST|Sakshi
రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌గా అంజలి
–శ్రీకాకుళంలో అవార్డు ప్రదానం
 
కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రస్థాయి ఉత్తమ జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)వలంటీర్‌గా కర్నూలుకు చెందిన కె. అంజలి ఎంపికయ్యింది. శనివారం ఆమెకు శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ గోకుల్‌ కృష్ణ, స్టేట్‌ లైసెన్స్‌ ఆఫీసర్‌ రామచంద్రరావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. బనగానపల్లికి చెందిన హోటల్‌ వ్యాపారి కె. బద్రీనాథ్, కె. సుధ కుమార్తె అయిన కె. అంజలి కర్నూలులోని సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. కళాశాలలో విద్యనభ్యసించే సమయంలో ఆమె ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనింది. ఆమె చేసిన సేవలకు  2015–16 సంవత్సరానికి గాను రాష్ట్ర అధికారులు ఉత్తమ అవార్డు పురస్కారం అందజేశారు. 
 
మరిన్ని వార్తలు