ఏఎన్‌ఎంల సమ్మె

16 Jul, 2016 19:59 IST|Sakshi

వినాయక్‌నగర్: కాంట్రక్ట్ రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు తెలంగాణ యునెటైడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని సంఘం జిల్లా కార్యాలయంలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి సంజీవ్ జార్జ్, నాయకులు ఖలీల్, నన్నె తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు