నిత్యాన్నదానానికి రూ.2,00,116 విరాళం

8 Oct, 2016 23:23 IST|Sakshi
అన్నవరం :
సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి ఇద్దరు దాతలు శనివారం రూ.2,00, 116 విరాళాలుగా సమర్పించారు. విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన చల్లపల్లి సూర్య నాగేంద్ర, సూర్య వెంకటలక్ష్మీ హేమలత దంపతులు రూ. 1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జ్యేష్ట బహుళ చవితి నాడు తాకాశి వరలక్ష్మి పేరు మీద అ న్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన అద్దంకి రవికుమార్‌ రూ.లక్ష విరాళానికి సంబందించిన బ్యాంక్‌ డీడీని ఈఓకు అందజేశారు.
 
>
మరిన్ని వార్తలు