ధర్మవరం అర్బన్: డబ్బు ఎగవేత కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న కళానికేతన్ ఎండీ లీలాకుమార్, డైరెక్టర్లు లక్ష్మీశారద, రాజుకిషన్, వెంకటేశ్వర రవిప్రసాద్లపై న్యాయవాది డీఎల్ఎన్ మూర్తి ద్వారా బీవీఆర్ శారీస్ యజమాని రవికాంత్ ధర్మవరం కోర్టులో జడ్జికి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని జడ్జి బుధవారం ఆదేశించారు.
గురువారం పట్టణ పోలీస్స్టేçÙన్కు ఈ ఫిర్యాదును పంపించనున్నట్లు న్యాయవాది మూర్తి తెలిపారు. 2014 ఫిబ్రవరి నుంచి 2016 మే వరకు తమతో కళానికేతన్ సంస్థ పట్టుచీరలను కొనుగోలు చేసిందని, అందుకు సంబంధించిన రూ.61,76,355 ఎగ్గొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.