బయటపడిన మరో చిన్నారి మృతదేహం

25 Apr, 2017 23:21 IST|Sakshi
పారుమంచాల(జూపాడుబంగ్లా): మండలంలోని పారుమంచాల గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో పడి మృతిచెందిన సంఘటన పాఠకులకు విధితమే. గ్రామానికి చెందిన రేణుకమ్మ తన ఇద్దరు కుమార్తెలు కావేరి(16నెలలు) ఇందు(5)లతో బావిలోపడి మృతిచెందగా రేణుకమ్మ, కావేరి మృతదేహాలు సోమవారమే లభించగా ఇందు మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఇందు మృతదేహాన్ని ఏఎస్సై గోపాల్, కానిస్టేబుల్‌ విక్టర్‌ బావిలోంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంత జరిగినా తన భార్యా, పిల్లల మృతిపై నాగరాజు ఏమాత్రం అనుమానం వ్యక్తం చేయకపోగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదుచేయకపోవటం గమనార్హం. మృతురాలి తల్లి శ్యామలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు