'రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి'

20 Nov, 2015 11:53 IST|Sakshi

నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. నర్సాపురం మండలంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట దెబ్బతిన్న రైతులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని కొత్తపల్లి డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు