12వందల ఎకరాల భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ

21 Feb, 2016 11:18 IST|Sakshi

కృష్ణా జిల్లా: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ భూసమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గన్నవరం పరిసరాల్లోని 11 గ్రామాల పరిధిలో 1229.94 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 6లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కాంపిటెంట్ అథారిటీ సూచించింది. భూసమీకరణ నోటిఫికేషన్తో 11 గ్రామాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు