భద్రాద్రిలో ఏపీమంత్రి

16 Sep, 2016 22:29 IST|Sakshi
  • రామాలయంలో పూజలు చేసిన రావెల
  •  
    భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌ బాబు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రావెల గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, దేవస్థాన ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, అభయాంజనేయ స్వామివారి ఆలయాలను దర్శించుకున్నారు. మంత్రికి దేవస్థానం అర్చకుల స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్‌కుమార్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, టీడీపీ భద్రాచలం, ముంపు మండలాల ఇన్‌చార్జ్‌ కొమరం ఫణీశ్వరమ్మ, జెడ్పీటీసీ రవికుమార్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు