రఘువీరాకు అస్వస్థత

5 Nov, 2015 15:24 IST|Sakshi

పెందుర్తి: విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఘగర్ లెవెల్స్ పడిపోవడంతో కళ్లు తిరిగిపడిపోయారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శారదాపీఠానికి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయనను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు