సౌత్‌ జోన్‌∙త్రోబాల్‌ టోర్నీకి ఏపీ జట్టు

28 Oct, 2016 19:08 IST|Sakshi
సౌత్‌ జోన్‌∙త్రోబాల్‌ టోర్నీకి ఏపీ జట్టు

విజయవాడ స్పోర్ట్స్‌: కేరళలో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే సౌత్‌ జోన్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఏపీ జట్టును త్రోబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఇ.సులోచన శుక్రవారం విడుదల చేశారు. పురుషుల జట్టులో కేపీ దేవస్సీ, పి.వీరభద్ర, జె.కిషోర్, డి.దామోదర్, వై.వర్షిత్‌శంకర్,  ఎస్‌.పవన్‌ప్రభాత్, జె.అజయ్‌కుమార్, జి.ఆనంద్‌బాబు, ఎ.బాలాజీ చౌదరి, ఎం.మణికంఠేశ్వరరెడిడ, ఎల్‌.వాసు, ఎస్‌.అజిత్‌కుమార్‌రెడ్డి, ఎ.అఖిల్, బి.సందీప్, డి.మునియ్య, ఎస్‌.నానాజీ ఎంపికయ్యారు. మహిళల జట్టులో బి.శ్యామల గౌరీ, ఎస్‌.శైలజా, యు.పూజిత, ఇ.మౌనిక, ఓడీ అమూల్య, వి.తేజశ్రీ, బి.అఖిల, వై.లిఖిత, వి.పూజిత, ఎం.హిమబిందు, వి.మాన స, ఎం.స్వాతి, డి.జూలీ, పి.తేజశ్వనీ, .జి.పావని, ఎంపికయ్యారు. జట్టు కోచ్‌గా వై.పవన్‌కుమార్‌రెడ్డి, మేనేజర్‌గా ఇ.అప్పలరాజు వ్యవహరిస్తారని అసోసియేషన్‌ కార్యదర్శి ఇ.సులోచన తెలిపారు. జట్టు శుక్రవారం పయన ం కాగా, ఇందిరగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో  డీఎస్‌డీవో ఎండీ సిరాజుద్దీన్‌ శుభాకాంక్షలు తెలిపారు.



 

మరిన్ని వార్తలు