పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ

26 Aug, 2016 00:05 IST|Sakshi
పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో త్వరలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరుకి చెందిన సుందరరాజగోపాలన్‌ రూ. 50వేలు విలువచేసే పట్టు వస్త్రాలను గురువారం బహూకరించారు. ఉదయం స్వామి దర్శనానికి వచ్చిన దాత సంబంధిత పట్టువస్త్రాలను ఆలయ సూపరింటిండెంట్‌ కష్ణారావుకు అందజేశారు. పవిత్రోత్సవాల రోజుల్లో ఆలయంలో ఉన్న దేవతామూర్తులకు పట్టువస్త్రాలను అలంకరించనున్నారు. 
మరిన్ని వార్తలు