అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే డే బోర్డర్ (నాన్ రెసిడెన్షియల్) కోచింగ్ సెంటర్స్ కోసం క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్డీఓ బాషామోహిద్దీన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రాచుర్యం పొందిన వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో అథ్లెటిక్స్–10, వాలీబాల్, బాస్కెట్బాల్–12 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు శిక్షణతోపాటు ఇతర వసతి ఉంటుందన్నారు. 13 నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–243175 నంబర్లో సంప్రదించాలన్నారు.