సండ్ర బెయిల్పై వాదనలు పూర్తి, నిర్ణయం రేపటికి

13 Jul, 2015 13:20 IST|Sakshi

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.  బెయిల్ పిటిషన్పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. విచారణ పూర్తయినందున సండ్రకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తే...కేసు కీలక దశలో ఉందని, సండ్రకు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. దాంతో వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు