ఆరోగ్య ‘సిరి’కి మంగళం

9 Dec, 2016 01:53 IST|Sakshi
ఒకప్పుడు ఏ జబ్బు చేసినా పేదలు భయపడేవారు కాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉందన్న భరోసాతో బతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పథకానికి తూట్లు పొడిచిన తెలుగుదేశం పార్టీ సర్కారు ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరుమార్చి దానిని నిర్వీర్యం చేసేందుకు  యత్నిస్తోంది. నిధుల విడుదలలో అలసత్వం  ప్రదర్శిస్తోంది. ఫలితంగా పేద రోగులు అల్లాడుతున్నారు. దీంతో ప్రజల పక్షాన వైఎస్సార్‌ సీపీ గళం విప్పనుంది. శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయనుంది. 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్టీఆర్‌ వైద్యసేవగా మారుమార్చినా.. ఆ పథకం ఇప్పటికీ ఆరోగ్యశ్రీగానే జనం గుండెల్లో నిలిచిపోయింది. ఇది పేదలను ఆ పథకం ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తోంది.  అలాంటి పథకం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సర్కారు నిర్వాకం వల్ల నిర్భాగ్యులకు అందకుండా పోతోంది. ఫలితంగా పేదలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ కార్డుతో దర్జాగా కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి చికిత్స అనంతరం ఆరోగ్య సిరితో తిరిగి వచ్చిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం వివరాలు ఆరోగ్యమిత్రల వద్ద కూడా అందుబాటులో లేవంటే ఆ పథకం ఎంతగా నిరుగారిపోయిందో అర్థమవుతోంది.  ప్రభుత్వం  నిధులు తగ్గించడమే ఈ దుస్థితికి కారణం. దీనివల్ల ప్రైవేటు వైద్యశాలలు వైద్యసేవ ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి   జంకుతున్నాయి. పేద రోగులను అవస్థల పాలే్జస్తున్నాయి. పక్షవాతం వంటి జబ్బులు వస్తే మంచి వైద్యం కోసం కార్పొరేటు ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ప్రస్తుతం పేదలకు ఉండటం లేదు. కేవలం  ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స తీసుకోవాల్సిన  దుస్థితి నెలకొంది. గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతినెలా మండల కేంద్రం లేదా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయాలను వివరించేవారు.  ప్రముఖ వైద్యులు పేదలకు సేవలు అందించేవారు. అయితే  ఏడాదిగా ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు లేవు. 
 
ఆరోగ్యశ్రీకి రూకల్పన ఇలా.. 
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని దివగంత ముఖ్యమంత్రి  వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి  2007 జూలై 7న ప్రారంభించారు. తెల్ల కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హమైందిగా నిర్ణయించారు. ఈ సేవలకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా రూపకల్పన చేశారు.  125 రకాల శస్త్రచికిత్సల అనంతరం ఏడాదిపాటు మందులు వాడాల్సి ఉండడంతో ఆ ఖర్చునూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయించారు.   రోగులను ఇ¯ŒSపేషెంట్లుగా చేర్చుకునే ప్రక్రియలో ఆరోగ్యశ్రీ ట్రస్టు పకడ్బందీగా వ్యవహరించేది. అప్పట్లో కేవలం 12 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే పద్ధతిని ట్రస్టు అమలు చేసింది. దీంతో పేదలకు సత్వరం వైద్యం అందేది. కానీ ఇప్పుడలా లేదు. 
 
కార్డుల పంపిణీ కూడా పెండింగ్‌లోనే ....
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌ వైద్యసేవగా మార్చి ఆ పార్టీ రంగు కనబడేలా కొత్తగా హెల్త్‌కార్డులను రూపొందించారు. వీటిని లబ్ధిదారులకు అందించే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ద్వారా  ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ అధికారుల వద్దే ఈ కార్డులు మూలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో ఈ కార్డుల ముద్రణ పూర్తి చేశారు. ముద్రణలో లబ్ధిదారుల ఫొటోలు అదృశ్యమయ్యాయి. కొన్నింటిపై మాత్రమే ఫొటోలు ఉన్నాయి.  జిల్లాలో కొన్నివేల కార్డులు పంపిణీ కాకుండా ఉండిపోయినట్లు సమాచారం. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు హెల్త్‌ కార్డులు లేక ఖరీదైన వైద్య సేవల కోసం కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకునే దుస్థితి నెలకొంది.
 
నడుం కట్టిన వైఎస్సార్‌ సీపీ 
ఆరోగ్యశ్రీ నిర్వీర్యంతో జనం పడుతున్న అవస్థలను గమనించిన వైఎస్సార్‌ సీపీ వారి తరఫున పోరాటానికి సిద్ధమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైంది. ఈ ధర్నాకు పార్టీ శ్రేణులు భారీ సన్నాహాలు చేస్తున్నాయి.  
 
తెలుగుదేశం ప్రభుత్వం రాకతో అనారోగ్యం 
తెలుగుదేశం ప్రభుత్వం రాకతో ఆరోగ్యశ్రీ ఆనారోగ్యం బారిన పడింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు అవసరమైతే అనుమతులకే వారం నుంచి పదిరోజుల సమయం పడుతోంది. దీంతో పేదలు వైద్యం సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వ తీరుతో వైద్యసేవ నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో అత్యవసర శస్త్ర చికిత్సలను దాదాపుగా నిలిపివేశారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్‌ వైద్యసేవగా మార్చిన తర్వాత మరో వంద జబ్బులను  పథకంలో కలపడమే కాకుండా  రూ.2 లక్షల  పరిమితిని రూ.2.50లక్షలకు పెంచిన సర్కారు అనుమతుల మంజూరులో మాత్రం జాప్యం చేస్తోంది. నిధుల విడుదల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీనివల్ల చాలామంది పేదలు సొంత డబ్బుతోనే వైద్యం చేయించుకుంటున్నారు. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. దీనికితోడు ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు మూడు నెలలుగా బిల్లులు అందలేదు. దీంతో ఖరీదైన శస్త్రచికిత్సలకు ఆయా ఆసుపత్రులు వెనుకాడుతున్నాయి.  చేద్దాములే అనే ధోరణిలో ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ముందు డబ్బు పెట్టి వైద్యం చేయించేసుకోవాలని రోగులకు సూచిస్తున్నాయి. ఆ తర్వాత సీఎం రిలీఫ్‌ ఫండ్, లేదా ఆపద్బంధు వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు కూడా సర్కారు బిల్లులు మంజూరు చేయడం లేదు. పెద్దమొత్తంలో బకాయి పెట్టింది. ఓ రోగికి ఆపరేష¯ŒS చేయాలంటే కనీసం పదిరోజులపైనే పడుతోంది.  నరసాపురం వంటి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు చేయకుండా ఏలూరు, కాకినాడలకు రిఫర్‌ చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు