వివక్షపై యుద్ధం

24 Jul, 2016 23:01 IST|Sakshi
వివక్షపై యుద్ధం

సాక్షి,మాదాపూర్‌: సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని వ్యంగ చిత్రకళ నిపుణులు పి.శంకర్‌  పేర్కొన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌ గ్యాలరీలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.శంకర్, డాక్టర్, చిత్ర కళాకారుడు ఎం.చంద్రమౌళి వేసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శన 31వ తేదీ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.లక్ష్మీ, డాక్టర్‌ రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు