సామాన్యంగా సంచార జీవులు తమ సామాగ్రిని గాడిదపై వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే మహబూబ్నగర్కు చెందిన గొర్రెల కాపర్లు శనివారం తమ సామగ్రిని గుర్రంపై వేసి తీసుకు వెళ్తూ ములుగు–జాకారం మధ్య సాక్షి కెమెరాకంటికి చిక్కారు.
గొర్రెల మందలతో వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో.. సరుకు రవాణాతో పాటు పనులపై వెళ్లేందుకు తమకు కూడా ఉపయోగపడుతాయని గుర్రాలను పెంచుకుంటున్నట్లు కాపరులు ఈ సందర్భంగా తెలిపారు.