ఆ నేతలపై ఫిర్యాదు చేసినందుకు..

5 Oct, 2016 23:34 IST|Sakshi
గాయాలను చూపుతున్న సాయి ప్రసాద్‌

పంజగుట్ట: అధికార పార్టీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశారని అల్వాల్‌కు చెందిన సాయి ప్రసాద్‌ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు, నాయకుడు నక్కా ప్రభాకర్‌ అల్వాల్‌లో ఆక్రమించుకున్న స్థలంలో రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని మరో రెండు అంతస్థులు అక్రమంగా కట్టిన భవనాలపై ఆర్‌టిఏ ద్వారా సమాచారం తీసుకుని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశానన్నారు.

దీంతో నక్కా ప్రభాకర్‌ అతని అనుచరులు తన ఇంటì కి వచ్చి తనపై దాడులు చేశారని, ఫిర్యాదు వాపస్‌ తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. ఈ విశయమై పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, త్వరలో హెచ్‌ఆర్‌సీని కూడా ఆశ్రయిస్తానని తెలిపారు.

 

మరిన్ని వార్తలు