యువకుడిపై హత్యాయత్నం

31 Jul, 2016 00:00 IST|Sakshi

కడప అర్బన్‌ : కడప నగరం భగత్‌సింగ్‌నగర్‌ రోడ్డుపై శనివారం రాత్రి జావిద్‌ అనే యువకుడిపై జఫ్రుల్లా,అతని మామ పీరాన్, ఖాదర్, మరొకరు బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.  జఫ్రుల్లా, జావిద్‌కు మధ్య ఉన్న మనస్పర్థల కారణంగానే ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు