గురుకులాల్లో ఖాళీల భర్తీకి 2న కౌన్సెలింగ్‌

29 Jul, 2016 00:43 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 2వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఏలో 94, బీకాంలో 134, బీఎస్సీ(ఎంపీసీ)లో 17, మొత్తం 245 ఖాళీలున్నాయని, వీటిని భర్తీ చేసేందుకు 2న ఉదయం 10గంటలకు రాంరెడ్డిగూడ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినీలు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. 
 
మరిన్ని వార్తలు