కడియం :
కడియం హైస్కూలు ఆవరణలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ అయ్యప్ప స్వామి పడిపూజ కనుల పండువగా నిర్వహించారు. బుర్?రలంకకు చెందిన తాడాల వీరవెంకట్రావు గురుస్వామి 36వ శబరిమల దీక్ష సందర్భంగా ఆయన శిష్య, ప్రశిష్య బృందం కోటిబిల్వార్చన, పడిపూజ, తాంత్రిక పూజ, గురుపూజోత్సవం జరిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది అయ్యప్ప స్వాములు, పీఠం గురువులు హాజరయ్యారు.