వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

14 Sep, 2016 00:37 IST|Sakshi
ఆత్మకూర్‌ : మండల పరిధిలోని బాలకిష్టాపూర్‌ తండాలో మంగళవారం రాత్రి 10:30గంటలకు వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుం ది. ఎస్‌ఐ సీహెచ్‌ రాజు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన మంగ్యానాయక్‌ (38) వినాయక నిమజ్జనంలో ఉన్న జనరేటర్‌ స్టార్ట్‌ కాకుండా మొరాయించింది. దాన్ని   స్టార్ట్‌ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు భార్య శివమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు