సత్యదేవుని సన్నిధిలో బదరికాశ్రమ పీఠాధిపతి

31 Dec, 2016 22:24 IST|Sakshi
అన్నవరం : 
బెంగళూరుకు చెందిన ద్వారకా బదరికాశ్రమం పీఠాధిపతి విద్యానారాయణ తీర్థ స్వామీజీ శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద స్వామీజీకి పండితులు ఘనంగా స్వాగతం పలికారు. సత్యదేవుని దర్శనం తర్వాత వేదపండితులు ఆశీస్సులందచేసి స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు స్వామీజీ ఆశీస్సులు పొందారు. వారి వెంట వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, చిట్టి శివ ఉన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు