సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వెల్ టీడీపీలో హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన బద్వేల్ జడ్పీటీసీ శిరీష రెడ్డి, గోపవరం జడ్పీటీసీ రమణయ్యలు రాజీనామా చేశారు. జెడ్పీటీసీలు రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లకు పంపారు. ఎమ్మెల్యే జయరాములుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. విజయమ్మ, జయరాముల వర్గపోరు టీడీపీకి తలనొప్పిగా తయారైంది.