బ్యాలెట్‌ పత్రాలు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రం

10 Mar, 2017 00:26 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్ర, ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ గురువారం ముగిసింది. బ్యాలెట్‌ పత్రాలను అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. గురువారం అనంతపురం జిల్లాకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను  స్ట్రాంగ్‌ రూంలోకి చేర్చారు. వైఎసార్‌ జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు శుక్రవారం రానున్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు